Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారీ విస్ఫోటనం.. 50 లక్షల ఆస్తినష్టం
- నార్కెట్పల్లి, చిట్యాలలో వడగండ్ల వాన
నవతెలంగాణ-నార్కట్పల్లి
నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి, చిట్యాలలో బుధవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నార్కట్పల్లి శివారులోని 220 కేవీ సబ్ స్టేషన్పై పిడుగు పడటంతో భారీ విస్పోటనం జరిగింది. పిడుగుపాటుకు సబ్స్టేషన్లోని ఆరు ఎల్టీ లైన్లు, జామర్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 45నిమిషాల పాటు పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఫైరింజన్ అధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ట్రాన్స్కో, పీస్ పీడీసీఎల్ ఎస్ఈలు కృష్ణయ్య, లక్ష్మణ్రాజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో నిలిపేశారు. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆరు ఎల్టీ లైన్లు ధ్వంసం కావడంతో మరమ్మతులు చేసేందుకు వారం నుంచి 10 రోజులు పడుతుందని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఘటనా స్థలాన్ని నల్లగొండ డీఈ విజరుకుమార్, ఏడీ నరేశ్కుమార్, నార్కట్పల్లి, చిట్యాల ఏఈలు లక్ష్మయ్య, రమేశ్, ఎస్ఐ విజరుకుమార్ పరిశీలించారు.