Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డీవైఎఫ్ఐ పిలుపు
- హైదరాబాద్లో మొక్కలు నాటిన నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మొక్క నాటు... ప్రకృతిని కాపాడు అని భారత ప్రజాతంత్ర యువజన యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పిలుపునిచ్చింది. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్లోని పాతబస్తీలో జంగంమేట్లో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం విప్లవ్కుమార్, కార్యదర్శి ఎ విజరుకుమార్, హైదరాబాద్ సౌత్ కార్యదర్శి కృష్ణానాయక్ తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజరుకుమార్ మాట్లాడుతూ జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం కరోనా నేపథ్యంలో ప్రకృతి, పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మానవాళిపై ఉందన్నారు. దేశంలో 23 శాతం, రాష్ట్రంలో 21 శాతం అడవులున్నాయని గుర్తు చేశారు. కనీసం 30 శాతం అడవులుండాలని ప్రపంచ పర్యావరణ నియమాలు చెప్తున్నాయని చెప్పారు. ధనిక దేశాలు అవి పాటించకుండా పెత్తనం కోసం అడవులను ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో అడవుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రమైన నల్లమల అడవులను యురేనియం తవ్వకాల పేరుతో ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అడవులను రక్షించుకోవాలని చెప్పారు. మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు.