Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు
నవతెలంగాణ-షాబాద్
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దారితప్పారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి అసభ్యకర మెసేజ్లు, వీడియో చాటింగ్ ద్వారా వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
షాబాద్లోని ఆమన్గల్ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని లాక్డౌన్తో ఇంటికి వచ్చింది. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో అదే పాఠశాలలో ఫిజిక్స్ బోధించే పార్ట్టైమ్ ఉపాధ్యాయుడితో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా ఫోన్లో విద్యార్థిని సందేహాలు నివృత్తి చేసే క్రమంలో అసభ్యకరంగా మెసేజ్లు పంపుతూ, వీడియో చాటింగ్ చేస్తూ వేధించేవారు. గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం షాబాద్లో పాఠశాల ప్రిన్సిపాల్కు తెలిపారు. అనంతరం షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ శంకరయ్య తెలిపారు.