Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర, గుజరాత్లో హై అలర్ట్
గాంధీనగర్ : నిసర్గ తుఫాన్తో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్లలో హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్ తీరం వెంబడి ఉన్న వల్సాద్, నవసరి జిల్లాల్లో నివసిస్తున్న సుమారు 43వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డిఆర్ఎఫ్)కి చెందిన 13 బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డిఆర్ఎఫ్)కి చెందిన ఆరు బృం దాలను మోహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్డిఆర్ఎఫ్కు చెందిన మరో ఐదు బృందాలను కూడా సహాయక చర్యల కోసం నియమించినట్లు పేర్కొంది. సముద్ర తీరానికి సమీపంలో నివసిస్తున్న సుమారు 32వేలమందిని తరలించినట్లు వల్సాద్ కలెక్టర్ ఆర్ఆర్.రావల్ తెలిపారు. నవసరిజిల్లా నుండి పదివేలమందిని తరలించినట్లు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఇవి గంటలకు 120 కి.మీ. వేగం వరకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు వెల్లడించారు.