Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాత్రి సమయాల్లో సీఎం కేసీఆర్ బీజేపీకి మద్దతుగా ఉంటున్నారని, పగలు మాత్రం జై టీఆర్ఎస్ అంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీతో రహస్య ఒప్పందం ఉన్నందుకే ప్రశ్నించడం లేదన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో జీవనోపాధి దెబ్బతినడంతో పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న తన ఇంట్లో ఒకరు నిరాహారదీక్ష చేయనున్నట్టు తెలిపారు.
సీఎం భౌతికదూరం పాటించారా?
కొండపోచమ్మ ప్రాజెక్టు సమయంలో సీఎం కేసీఆర్ భౌతికదూరం పాటించారో ? లేదో? పోలీసులు చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. తాము బయటికి వెళితే కరోనా కేసులు పెడుతున్నారని ఆరోపంచారు.
ఆరోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయాలి
వైద్యారోగ్యశాఖలో దీర్ఘకాలంగా నిలిచిపోయిన 4560 పోస్టులను భర్తీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. 2017-18లో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించి పోస్టుల భర్తీ మాత్రం మరిచిపోయారని విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్-19 సష్టించిన సంక్షోభ తీవ్రతకు తగినంత మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది లేకపోవడం కూడా కారణమైనప్పటికీ నియామకాలను చేపట్టకపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల నాటికి ఫెయిల్ మార్కులు
సీ ఓటర్ సర్వేలో సీఎం కేసీఆర్ కు 16వ స్థానం వచ్చిందనీ, ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఫెయిల్ మార్కులు రావడం ఖాయమని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి విమర్శించారు. తన పాలనపై గొప్పలు చెప్పుకునే కేసీఆర్కు సర్వే రిపోర్టు చెంపపెట్టులాంటిదని అభివర్ణించారు.