Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.31 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామంలోని ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.31లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. పరిశ్రమలో మొలక శాతం కట్టకుండా ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచిన రూ.31లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 12.24 లక్షల విలువైన 1529 మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు, రూ.18.76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. ఈ ప్యాకెట్లపై టెస్టింగ్ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో తేడా ఉందనీ, సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాలు విక్రయిస్తున్నారనీ అధికారులు తెలిపారు. రూ. 2.70కోట్ల విలువైన విత్తనాలకు సంబంధించి సరైన రికార్డులు చూపకపోవడంతో మొత్తం పరిశ్రమ రికార్డులను కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన విత్తనాలను స్థానిక వ్యవసాయాధికారి అర్చ నకు అప్పగించి, పరిశ్రమ యాజమాన్యంపై విత్తన చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డిప్యూటీ డీఎస్పీ సీ.రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ దామో దర్, ఇన్స్పెక్టర్ ఎం.ఉస్సెన్ నాయుడు, ఎస్ఐ సాదత్ మియాలు పాల్గొన్నారు.Aశ