Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బాకీ వసూలు ట్రిబ్యూనల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మొండి బాకీలకు సంబంధించిన అత్యవసర వివాదాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరిస్తామని హైదరాబాద్లోని బాకీ వసూలు ట్రిబ్యూనల్ (డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యూనల్-2) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిసైడింగ్ అధికారి ప్రవీణ నేతృత్వంలో ఈనెల ఒకటి నుంచే కేసుల పరిష్కార ప్రక్రియను ప్రారంభించామని ట్రిబ్యూనల్ రిజిస్ట్రార్ రెన్జీమ్ ఇస్మా యిల్ పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పేపర్ రహిత సేవలను అందిస్తున్నామని వివరించారు