Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డీఈవోలకు విద్యాశాఖ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2004, సెప్టెంబర్ ఒకటికి ముందు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయబడి, నియామక పత్రాలు ఆలస్యం కారణంగా నూతన పింఛన్ పథకం (సీపీఎస్) పరిధిలో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఉపాధ్యాయుల వివరాలను నిర్ణీత నమూనాలో ఈనెల 10వ తేదీలోగా సమర్పించాలని పాత జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో)ను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు పివి శ్రీహరి బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీన్ని అత్యవసరంగా పరిగణించాలని కోరారు. ఈ ఉత్తర్వులు అమలైతే పాత పింఛన్ పథకం (ఓపీఎస్) పరిధిలోకి 2002, 2003 డీఎస్సీల ఉపాధ్యాయులు వస్తారు. మరికొంత మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
డీఈవోలు సత్వరం సమర్పించాలి : టీఎస్యూటీఎఫ్
పాఠశాల విద్యాశాఖ కోరిన ఉపాధ్యాయుల వివరాలను డీఈవోలు సత్వరం సేకరించి సమర్పించాలని టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతనెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి 2004, సెప్టెంబర్ ఒకటి ముందు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు ఆలస్యమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్ పథకం వర్తింపచేయాలని కోరామని గుర్తు చేశారు.