Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజిగేట్కు తాళం వేయడంతో అన్నదాతల రాస్తారోకో
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
నిన్నటివరకు కూరగాయలు విక్రయించిన కామారెడ్డి జిల్లాకేంద్రం లోని ఫంక్షన్ హాల్కు యజమాని బుధవారం తాళం వేసుకున్నాడు. దీంతో అన్నదాతలు గంజ్లో విక్రయించేందుకు వెళ్లారు. అక్కడ సైతం తాళంవేసి ఉండడంతో ఆగ్రహించిన రైతులు అక్కడే గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు రోజుకో దగ్గర అమ్ముకోవాలని ఆదేశిస్తూ క్షోభకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ట్రాఫిక్ను సాకుగా చూపి డైలీ మార్కెట్ నుంచి గంజ్కి తరలించారనీ, లాక్డౌన్ పేరుతో అక్కడి నుంచి ఫంక్షన్ హాల్కు మార్చారనీ అన్నారు. ఇప్పుడు లాక్డౌన్ ముగియడంతో ఫంక్షన్హాల్తో పాటు గంజ్కి తాళాలేసి ఉన్నాయనీ, ఇప్పుడు మేం ఎక్కడ విక్రయాలు చేపట్టాలనీ ప్రశ్నించారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్, ఆర్డీవో రాజేందర్కుమార్, తహసీల్దార్ అమీన్సింగ్ వచ్చి గంజ్ గేటు తాళాలు తీసివేయించారు. మార్కెట్ను గత మాదిరిగా యథాతథంగా నిర్వహించటానికి అనుమతించడంతో రైతులు ఆందోళన విరమించారు.