Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటన
నవతెలంగాణ- నార్కట్పల్లి/ హుజూర్నగర్టౌన్/పాలకవీడు
ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు సంక్షోభంతో విలవిల్లాడుతుం టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలోనూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల,సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, నేరేడుచర్ల మండలాల్లో హరితహారంతోపాటు పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లాక్డౌన్తో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నా.. వేగంగా పుంజుకుంటున్నా మని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 54.22 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. అందరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లాలో బ్రాహ్మణ వెళ్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు ఇప్పటికే మంజూరు చేశామనీ, త్వరితగతిన పనులు పూర్తిచేసి ఈ ప్రాంత రైతుల రుణాన్ని తీర్చుకుంటామని అన్నారు.
నకిరేకల్ నియోజక వర్గానికి సాగునీరు అందించే ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువ పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్రెడ్డి, కలెక్టర్లు ప్రశాంత్జీవన్ పాటిల్, వినరుకృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తెరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
కేటీఆర్పై ఉత్తమ్ ప్రశంసలు
హుజూర్నగర్లో ఒకే వేదికపై ఉన్న మంత్రి కేటీఆర్, ప్రతిపక్ష నేత ఉత్తమ్కుమార్రెడ్డి.. ప్రశంసలు, అభినందనలు తెలుపుకున్నారు. 'మీ రాక కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు' అని కేటీఆర్ ను ఉద్దేశించి ఉత్తమ్ అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు హుజూర్ నగర్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటు చేశానని, అందులోని సమస్య లను పరిష్కరించి పేదలకు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు.
హుజూర్నగర్లో మున్సిపల్ భవనాన్ని ప్రారంభించినం దుకు కేటీఆర్కు, ప్రభుత్వానికి ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరా బాద్ నుంచి విజయవాడకు రైలు మార్గం ఏర్పాటు చేసి సూపర్ఫాస్ట్ రైలు వచ్చే విధంగా చూడాలన్నారు. అందుకు కృషి చేస్తామని కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా, ఉత్తమ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి ఐదేండ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.