Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన 197 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించినట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాజిటివ్ వచ్చిన 128 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 25 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం, అదే విధంగా హౌం క్వారంటైన్లో ఉన్న 69 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 6 లక్షల 90 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని పేర్కొ న్నారు.. మొత్తంగా 32 లక్షల 50 వేల రూపాయలను మీడియా అకాడమి నిధుల నుంచి ఈ సహాయం అందించామని తెలిపారు. కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు మీడియా అకాడమి అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. సోమవారంనాటికి వివిధ జిల్లాల్లో కొత్తగా మరో 29 మంది జర్నలిస్టులకు పాజిటివ్ వచ్చిందనీ, వారితోపాటు మరో 17 మంది జర్నలిస్టులను హౌం క్వారంటైన్లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని ఆయన తెలిపారు. ఆ 29 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 5 లక్షల 80 వేలు, హౌంక్వారైంటైన్ లో ఉన్న17 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున ఒక లక్షా 70 వేలు, మొత్తం 7 లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. కరోనా వచ్చిన జర్నలిస్ట్లు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ వాట్సాప్ (8096677444) నెంబర్కి పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమి మేనేజర్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులను అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.