Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కక్షసాధింపు చర్యలు, అణచివేతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేరాఫ్ అడ్రసుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. తప్పుడు వార్తలు రాశారన్న ఆరోపణలతో విలేకర్లపై కేసులు పెట్టడం సరికాదన్నార. ముందు కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన కేసీఆర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారాసిటమాల్ టాబ్లెట్తో కరోనా రాదనీ, 20 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటితే వద్ద కరోనా వైరస్ బతకదనీ, అసలు వ్యాపించందనీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ తప్పుదారి పట్టించారన్నారు. పత్రికా యాజమాన్యాలు,విలేకర్లకు రావాలని శపించిన కేసీఆర్ వైఖరిని గతంలోనే ప్రజలంతా గమనించారని అన్నారు. పత్రికలు, జర్నలిస్టులపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
టీడబ్ల్యూజేఎఫ్ ఖండన
విలేకర్లపై తప్పుడు కేసులు పెట్టడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్, సబ్ఎడిటర్, పత్రిక సంపాదకులపై అక్రమ కేసు పెట్టడం సరైందని కాదని తెలిపారు. వార్తల పట్ల అభ్యంతరాలు ఉంటే ప్రెస్కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చని, క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా పత్రికా స్వేచ్ఛను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.