Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధన్యవాదాలు తెలిపిన టీవీ నిర్మాతల సంఘం నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీవీ కళాకారులు రెండు వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు టీవీ నిర్మాతల కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెస్ట్మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో వారు కలిశారు. కరోనా నేపథ్యంలో సినిమా చిత్రీకరణ సమయంలో భౌతిక దూరం పాటిస్టూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్గా మారిందనీ, స్వయం నియంత్రణతోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రి తలసానిని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, వినోద్బాల, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, డివై చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు.