Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలుష్య పరిశ్రమలకు నోటీసులివ్వడంపై హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
కరోనా వైరస్ వ్యాప్తి ఫలితంగా ఎంతోమందికి ఉపాధి దెబ్బతిందని, ఇలాంటి సమయంలో కాలుష్య పరిశ్రమల్ని మూసేయాలనే నోటీసులు ఇవ్వడంపై వేచి ఉండే ధోరణి అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సలహా ఇచ్చింది. హైదరాబాద్లోని టాటానగర్, శాస్త్రిపురం ఏరియాల్లోని పొల్యూషన్ ఇండిస్టీస్ మూసేయాలంటూ తామిచ్చిన నోటీసుల్ని రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ హైకోర్టు తెలిపింది. చట్ట ప్రకారం నోటీసులు లేని కారణంగా వాటిని వెనక్కి తీసుకోకపోతే తామే రద్దు చేస్తామని గత విచారణ సమయంలో హైకోర్టు హెచ్చరించింది. దీంతో నోటీసుల్ని రద్దు చేశామని, చట్టానికి లోబడి తాజా నోటీసులు ఇస్తామని అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ చెప్పారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ పైవిధంగా ప్రభుత్వానికి సూచన చేసింది. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవచ్చునని, అయితే కరోనా వేళ ఉపాధి లేని ఇబ్బందులు పడే వారు అధికంగా ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పింది. కాలుష్యం కారక పరిశ్రమలకు జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడివిడిగా ఇచ్చిన 20 నోటీసులను సవాల్ చేసిన రిట్లను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. 345 పరిశ్రమలకు నోటీసులు ఇస్తే 101 పరిశ్రమలు హైకోర్టుకు వచ్చాయని, 73 పరిశ్రమల్ని తీసేశారని ఏజీ చెప్పగానే, పాత నోటీసుల మేరకు సీజ్ లేదా తాళాలు వేసిన వాటిని తీసేయాలని ఆదేశించింది.
ఖాజాగూడ పెద్ద చెరువు భూములపై హైకోర్టు ఆరా
శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ పెద్ద చెరువు ఎంత విస్తీర్ణంలో ఉందో తెలియజేయాలని అదే విధంగా 2014 మ్యాప్లో 38.04 ఎకరాలు, గత ఏడాది మ్యాప్లో 37 ఎకరాలను వేరువేరుగా ఎందుకు ఉందో వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు మ్యాప్లను తమకు సమర్పించాలని సోమవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. రంగారెడ్డి జిల్లా ఖాజాగూడ పెద్ద చెరువును కాపాడాలని కోరుతూ సోషల్ వర్కర్ లుబ్నా సార్వస్వత్ హైకోర్టును ఆశ్రయించారు. అమికస్క్యూరీ ఎం.ప్రతాప్ కుమార్ హైకోర్టుకు అందజేసిన నివేదికలో 2014 ఫిబ్రవరి 25 తేదీ నాటి మ్యాప్ ప్రకారం చెరువు 38.04 ఎకరాలని, 2019 ఏడాదిలోని మ్యాప్ మేరకు 37 ఎకరాలని ఉందని తెలిపారు. ఆ రెండు మ్యాప్లను సమర్పించాలని ప్రతివాదులైన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతోపాటు హెచ్ఎండీఏలను ఆదేశించిన హైకోరు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.