Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినా, వారికి ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్యూ) ప్రధాన కార్యదర్శి కె హన్మంతు అన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి, ఆర్టీసీ కార్మికులకు ఆరవ తేదీ నాటికి కూడా ఇవ్వకపోవడం వివక్షతో కూడుకున్న నిర్ణయమని సోమ వారం నాడొక పత్రికా ప్రకటనలో విమర్శించారు. గడచిన మూడు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు సగం జీతాలే ఇచ్చారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినా, వారికి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు, ఆర్థిక ప్రయోజనాలు అమలు కావట్లేదనీ, సీఎం కేసీఆర్ దీనిపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. సీసీఎస్ రుణాల కోసం 12వేల మంది దరఖాస్తులు చేసుకున్నారనీ, ఇప్పటి వరకు సంస్థకు రావల్సిన నిధుల్ని విడుదల చేయలేదని తెలిపారు.