Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పెద్దమొత్తంలో లంచం తీసుకుం టూ హైదరాబాద్ కమి షనరేట్ ఆఫ్ స్కూల్స్ సూపరిం టెండెంట్, జూనియర్ అసిస్టెం ట్లు ఏసీబీకి పట్టుబ డ్డారు. ఏసీబీ డీజీ జె.పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం ముషీరా బాద్కు చెందిన శ్రీనివాస్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న తమ పాఠశాల సాంత మరియా స్కూల్కు సీబీఎస్సి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ స్కూల్స్ సూపరింటెండెంటు లక్ష్మణ్కుమార్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫైలును ముందుకు కదపడానికి గాను ఇదే కార్యాలయానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ వపిన్రాజ్ ద్వారా రూ. 40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులను సోమవారం తన కార్యాలయం వద్ద లక్ష్మణ్కుమార్ తీసుకుం టుండగా ఏసీబీ అధి కారులు వలపన్ని పట్టుకున్నారు. లక్ష్మణ్కుమార్తో పాటు విపిన్రాజ్ను కూడా అరెస్టు చేసి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్గూడ జైలుకు తరలించారు.