Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరుల యంత్రాంగం
వానాకాలంలో సాగుచేస్తున్న రైతులకు వెంటనే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కొనసాగాయి. పాతవాటితో సంబంధం లేకుండా నూతన రుణాలివ్వాలని ఖమ్మం జిల్లా వైరా మండల ఎస్బీఐ, కోపరేటివ్ బ్యాంకు మేనేజర్లకు వినతి పత్రాలు అందజేశారు. సంగారెడ్డి ఎస్బీఐ బ్యాంకు వద్ద రైతులతో నాయకులు నిరసన తెలిపి, బ్యాంకు మేనేజర్కు వినతిపత్రం అందించారు. సీజన్ ప్రారంభమై 45 రోజులవుతున్నా రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. లక్షలోపు రుణమాఫీ ప్రకటించడంతో కొందరు పాత అప్పులు చెల్లించడం లేదని బ్యాంకులు కొత్త రుణాలివ్వడం లేదన్నారు. రూ.25వేలలోపు రుణాలను ఒకేసారి చెల్లిస్తే తిరిగి రుణం పొందే అవకాశం ఉందన్నారు. బ్యాంకుల వద్ద రైతులు, మహిళలు, వద్ధులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కోడేరు, వీపనగండ్ల మండల కేంద్రాల్లో యూనియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకుల ఎదుట ధర్నాలు కొనసాగాయి.