Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.20లక్షల లంచం డిమాండ్
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్నగర్ ఏరియాలో ఇరిగేషన్ ఏఈ(మిషన్ కాకతీయ) నవీన్ కుమార్ రూ.1లక్షా 20వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మధుసూధన్రావు, సీఐ రమణ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని అనంతారం చెరువు పనులను కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ రూ.20 లక్షలకు పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన బిల్లు చేయడానికి మంజూరు కోసం ఏఈ నవీన్ కుమార్ రూ.1లక్షా 20వేలు లంచం అడిగారు. ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. సుభాస్ నగర్లోని ఏఈ ఇంట్లో డబ్బులు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటీవ్గా వచ్చిందన్నారు.