Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శత జయంతి కమిటీి చైర్మెన్ కేశవరావు
నవ తెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మెమోరియల్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మెన్, ఎంపీ కె.కేశవరావు అన్నారు. సోమవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ....'పీవీ జ్ఞానభూమిలో మెమోరియల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్కిటెక్ కొన్ని డిజైన్లు చూపించారు. వాటిని కమిటీ పరీశీలించింది. మరో వారం రోజుల్లో కమిటీ మళ్ళీ సమావేశం జరుగుతుంది. ఈ నెల చివరిలో పీవీ మెమోరియల్ డీజైన్ ఫైనల్ చేస్తుంది. పీవీ శత జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సెమినార్ కు పీవీతో పరిచయం ఉన్న ఇతర దేశాల ప్రతినిధులను పిలవాలని భావిస్తోంది. అమెరికా, మలేషియా కు చెందిన ప్రతినిధులను పిలవాలని అనుకుంటున్నాం...' అని చెప్పారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సలహాదారు రమణాచారి తదితరులు హాజరైనట్టు వివరించారు.