Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అధికారులతీరుపై తమిళి సై అసంతృప్తి
నవ తెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికీ, గవర్నర్ తమిళిసైకి మధ్య గ్యాప్ పెరుగుతుందా అంటే నిజమేనంటున్నాయి అధికారిక వర్గాలు. తాజాగా కోవిడ్-19పై సమీక్షకు రావాలంటూ గవర్నర్ కోరటం..దానికి మేం రాలేమంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి బదులివ్వటం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని గవర్నర్ భావించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్కు రావాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ను... వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. కానీ షెడ్యూల్ ప్రకారం తమకు అంతకుముందే నిర్ణయించిన సమావేశాలున్నాయనీ, అందువల్ల గవర్నర్ సమావేశానికి రాలేమంటూ వారు స్పష్టంచేశారు. దీంతో తమిళిసై వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కరోనా ఉధతి నేపథ్యంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై తాను సమీక్ష నిర్వహించాలని భావిస్తే, రాకుండా డుమ్మా కొట్టడం ఎంతవరకు సమంజసమంటూ ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం సమావేశం నిర్వహిస్తామనీ...దానికి తప్పకుండా హాజరు కావాలంటూ ఆమె ఆదేశించారు.