Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఆయన శనివారం లేఖ రాశారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఫీవర్ తదితర ప్రధాన ఆస్పత్రులతోపాటు ఇతర జిల్లా ఆస్పత్రులలో రూ.17,500/- నెల వేతనంపైననే వేలాది మంది పారామెడికల్ సిబ్బంది గత 15 ఏండ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. మార్చి నుంచి ''కరోనా వైరస్'' విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్లో సమ్మెకు దిగితే ఇది సరైన సమయం కాదని ఒప్పించి సమ్మెను విరమింప చేయడం జరిగిందని గుర్తు చేశారు.
గౌరవెల్లి భూనిర్వాసితులను ఆదుకోండి
గౌరవెల్లి రిజర్వాయర్ పరిధిలోని భూనిర్వాసితులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. వారికి పునరావాస ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం అందించుటకు యుద్దప్రాతిపధికన చర్యలు చేపట్టాలని కోరారు.