Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కరోనా మహమ్మారితో రాజ్భవన్ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ అధికార నివాసమైన రాజ్భవన్లో దాదాపు 35 మంది సెక్యూరిటీ సిబ్బంది, అధికారులకు పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఇందులో టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వు పోలీసు బలగాలకు చెందిన కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్ ఎస్ఐ , ఎఎస్ఐలతో పాటు నలుగురు గన్మెనులు ఉన్నారని సమాచారం. గత రెండు రోజులుగా సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానాలు రావడంతో టెస్టులు చేయించారని తెలిసింది. ఇందులో 35 మందికి పాజిటివ్గా తేలినట్టు సమాచారం.