Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు ఎస్ఎఫ్ఐ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెప్టెంబర్లో అన్ని రకాల పరీక్షలనూ నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్కు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నదనే సంగతిని మరిచిపోవద్దని గుర్తు చేశారు. విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారని తెలియజేశారు. వర్సిటీలకు రావాలంటే రైల్వే సౌకర్యం కూడా లేదని వివరించారు. నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలన్నా విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలనే కనీస విషయాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.