Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆన్లైన్ విద్య పేరుతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నాయని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ విమర్శించింది. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చక్రధర్రావు, హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మీనారాయణ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46ను ఉల్లంఘించి రకరకాల పేర్లతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ చేసే విద్యాసంస్థలపై ఎంఈవోలు, డీఈవోలకు మెమోరాండం సమర్పించాలన్నారు.