Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల కూల్చివేత దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సచివాలయంలోని ఆలయం, మసీదును కూల్చివేయడం అన్ని వర్గాల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఓ ప్రకటనలో ఆరోపించారు. పాత భవనాలను కూల్చే క్రమంలో శిథిలాలు పడి.. ఆలయం, మసీదు దెబ్బతిన్నాయంటూ కేసీఆర్ ఇచ్చిన వివరణతో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అర్థమవుతోందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు కేసీఆర్కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సచివాలయం ఎలా కూల్చుతారు : రేవంత్రెడ్డి
''సచివాలయం కూల్చివేతకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు హడావుడిగా కూల్చివేతలు ఎలా చేపడుతోంది?''అని ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలను కూల్చివేసి.. మత విశ్వాసాలకు విఘాతం కలిగించేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు.