Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు విద్యుత్ సౌధలో ఘనంగా జరిగాయి. విద్యుత్ ఇంజినీర్లు,కార్మిక సంఘాల నాయకులు వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహించారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహద్దూర్ 143వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. విద్యుత్సౌధలోని నవాబ్ అలీ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రత్నాకరరావు, పి సదానందం తమ కార్యాలయంలో నవాబ్ అలీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రమంజిల్ జలసౌధలోని బిల్డింగ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గంబోనాగరాజు అధ్వర్యంలో మింట్కాంపౌండ్లోని కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) అధ్యక్షులు శివాజీ కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.