Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కళ్లుండీ చూడలేని కబోధుల్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ విమర్శించింది. సచివాలయం కూల్చివేతపై ఆయా పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపింది. హైకోర్టు గ్రీన్సిగల్ ఇచ్చాకే సెక్రటేరియట్ కూల్చివేత పనులను ప్రభుత్వం మొదలు పెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, విప్ ఎమ్ఎస్ ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.. సచివాలయంలోని ప్రార్థనా మందిరాల విషయంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారని అన్నారు.