Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోచారం రైతుల నిరసన
నవతెలంగాణ - కూసుమంచి
సీతారామా ప్రాజెక్టు కాల్వ కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదనీ, బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమనీ రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీతారామా ప్రాజెక్టు కాల్వ భూ సేకరణ కోసం సర్వే చేసి హద్దులు పెట్టిన ప్రాంతంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామ రైతులు శనివారం నిరసన తెలిపారు. 'మా ప్రాణాలు పోయినా భూములు మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. ఎకరా రూ.50 లక్షలు ఉంది. ఇంత విలువైన భూములను ఎలా ఇస్తాం. ఇవి పోయాక మేమేం చేసుకొని బతకాలె' అంటూ ప్రశ్నించారు. సీపీఐ(ఎం) నాయకులు అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు. రైతుల కోసం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయనున్నట్టు నాయకులు తెలిపారు. మాజీ ఎంపీపీ రామ సహాయం వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ అప్పారావు, కేవీపీఎస్, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.