Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలకు ఐఎంఏ, పెడియాట్రిక్ అసోసియేషన్ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విధి నిర్వహణలో కరోనా వచ్చిన వైద్యులకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో 30 పడకలు, వెంటిలేటర్లతో కూడిన ప్రత్యేక వార్డు కల్పించాలని వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్కు తెలంగాణ ఐఎంఏ, పిడియాట్రిక్ అకాడమీ విజ్ఞప్తి చేశాయి. మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో వైద్యులు కరోనా వైరస్తో విశేషంగా పోరాడుతున్నారనీ, ఐఎంఏ, పిడియాట్రిక్ అకాడమీ ప్రతినిధులు డాక్టర్ గార్లపాటి లక్ష్మణ్, డాక్టర్ ఎ.యశ్వంత్రావు, డాక్టర్ సీఎన్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్యాంసుందర్ మంత్రితో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కరోనా మహమ్మారిపై వైద్యులు ముందుండి చేస్తున్న పోరాటంలో ఎందరో వ్యాధిబారిన పడ్డారని వైద్యుల సంఘం సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వైద్యులు, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిమ్స్లో ప్రత్యేక వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.