Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీలో నర్సుల నిరసన
నవతెలంగాణ-చిలకలగూడ
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీతాలు పెంచాలంటూ 200 మంది నర్సులు శనివారం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి పనిచేస్తున్న తమకు రూ.17వేల జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ''కరోనా కారణంగా రెండు నెలలుగా జీతాలు లేకున్నా ఉద్యోగం చేశాం.. కానీ కరోనా నేపథ్యంలో కొత్తగా ఐదేండ్ల అనుభవం ఉన్న నర్సులను తీసుకుని వారికి రూ.25వేల జీతం ఇస్తామంటున్నారు.. కానీ ఎండ్ల తరబడి అనుభవం ఉన్న మాకు మాత్రం జీతాలు పెంచడం లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు వేతనాలు పెంచి, పర్మినెంట్ చేసేవరకు నిరసన తెలుపుతామన్నారు. అప్పటి వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.