Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హైకోర్టు గ్రీన్సిగల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పార్ట్టైం లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ఆమోదించింది. ఆ పోస్టుల్లో ఉన్న వారి స్థానంలో మెరిట్ ఆధారంగా భర్తీకి వీలుగా ప్రభుత్వం గత ఏడాది జూన్ 29వ తేదీన ఇచ్చిన మార్గదర్శకాల మెమో విషయంలో తప్పుపట్టేదేమీ లేదని తేల్చింది. మెమోను సవాల్ చేస్తూ పార్ట్టైం లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ దాఖలు చేసిన పిటిషన్ను గత జనవరి 29న సింగిల్ జడ్జి కొట్టేశారు. దీంతో వాళ్లు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేస్తే డివిజన్బెంచ్ ఎదుట కూడా చుక్కెదురైంది. మెమో వల్ల జూనియర్కాలేజీ విద్యలో నాణ్యమైన విద్య లభిస్తుందనీ, సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. మెమో వల్ల ఆ పదవుల్లో ఉన్న తమకు అన్యాయం జరుగుతుందనీ, శాశ్వత ప్రాతిపదికపై భర్తీ చేసే వరకూ ఆ పదవుల్లో తమనే కొనసాగించాలని పిటిషనర్లు చేసిన వాదనను తోసిపుచ్చింది. కాంట్రాక్టు లేదా తాత్కాలిక ప్రాతిపదికపై నియమించేటప్పుడు మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిపని. దీని వల్ల విద్యారంగంలో ప్రమాణాలు పెరుగుతాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పూర్తి ఆమోదయోగ్యంగానే ఉంది. అందుకే అప్పీల్ పిటిషన్లను కొట్టేస్తున్నాం.. అని డివిజన్ బెంచ్ తీర్పులో చెప్పింది. ఇదిలా ఉండగా, పార్ట్టైం ఎంప్లాయిని తొలగించి మళ్లీ పార్ట్టైం ఎంప్లాయిగా మరొకరిని నియమించరాదని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందనే వాదన తర్వాత మెమోను అమలు నిలిపేస్తూ సింగిల్ జడ్జి గత ఏడాది స్టే ఇవ్వడంతో ఆ పదవుల్లో 2019-2020 సంవత్సరానికి పాతవారే కొనసాగారు.