Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిగ్లిపూర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎ) తెలిపింది. డిగ్లిపూర్కు ఉత్తరాన 153 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సిఎ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గత నెల 28న కూడా డిగ్లిపూర్కు సమీపంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.