Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి సుబ్రమణ్యం జై శంకర్కు ఎంపీ నామా లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా నేపథ్యంలో కిర్గిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్కు సోమవారం లేఖ రాశారు. వైద్యవిద్యనభ్యసించే నిమిత్తం... తెలంగాణ నుంచి 170 మంది, ఏపీ నుంచి 65 మంది మొత్తం 235 మంది కిర్గిస్తాన్ కు వెళ్లారని తెలిపారు. అయితే కోవిడ్ నేపథ్యంలో వారు స్వదే శానికి రావటానికి వీల్లేకుండా పోయిందని పేర్కొన్నారు. అక్క డున్న ఏజెంట్ కూడా వారి దగ్గర డబ్బులు తీసుకుని.. మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వివరించారు. వారందరినీ స్వదే శానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నామా కోరారు.