Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి అరుణ మృతికి ఆ సంఘం రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎన్. ఆశాలత, ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. 20 ఏండ్లు సంఘంలో పనిచేస్తూ మహిళల సమస్యలపై దీర్ఘకాలిక పోరాటాలు చేశారన్నారు. శ్రామిక మహిళగా కూడా బాధ్యతలు చేపట్టనట్టు చెప్పారు. డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా అరుణ తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారని వివరించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.