Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుమురంభీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
ప్రత్యేక పోలీసు బలగాలతో కూంబింగ్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం అడవుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకులు తృటిలో తప్పించుకున్నారని జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో సోమవారం పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహించినట్టు చెప్పారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకులు మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్, వర్గేష్ ఏరియా కమిటీ మెంబర్తోపాటు మరో ముగ్గురు సభ్యులు తప్పించుకున్నట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో వారికి సంబంధించిన కీలక సమాచారం, పత్రాలు లభ్యమయ్యాయన్నారు. విప్లవ సాహిత్యం, యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, పాలిథీన్ కార్పెట్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.