Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాబార్డు 39 దినోత్సవంలో కమిషనర్ జనార్ధన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ప్రజలు, రైతులతో నాబార్డు పెనవేసుకున్నదని వ్యవసాయశాఖ కమిషనర్ బి జనార్ధన్రెడ్డి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ భారతానికి ఆ సంస్థ దగ్గరైందన్నారు. సోమవారం హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన 39వ నాబార్డు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎఫ్పీవోల బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. పంటలు, ఉత్పత్తి, పంట కాలనీలు, ఆయిల్ఫామింగ్ చేయడానికి బ్యాంకులు, నాబార్డు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎం వైకె రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వయంసహయక బృందం సభ్యురాలు ఎస్ మాధవిని సన్మానించారు.