Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సోమవారం ఒక్కరోజే 1550 కేసులు
- తొమ్మిది మంది మృతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా సోమవారం 1,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్తో తొమ్మిది మంది చనిపోయారు. ఇప్పటివరకూ 36,221 కేసులు రాగా, 365 మంది చనిపోయారు. ఇంకా 12,178 కేసులు యాక్టివ్గా ఉండటం గమనార్హం. తాజాగా 1,197 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 23,679 మంది డిశ్చార్జి అయ్యారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 926 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్లో 53, సంగారెడ్డిలో 19, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33, వరంగల్ అర్బన్ జిల్లాలో 16, వరంగల్ రూరల్ జిల్లాలో 8, నిర్మల్లో 1, కరీంనగర్లో 86, యాదాద్రిలో 5, మహబూబాబాద్లో 13, పెద్దపల్లిలో 6, మెదక్లో 6, మహబూబ్నగర్లో 13, మంచిర్యాల ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో 10, జయశంకర్ భూపాల్లిలో 6, నల్లగొండలో 41, సిరిసిల్లలో 7, ఆదిలాబాద్లో ఒకటి, వికారాబాద్లో 3, నాగర్కర్నూల్ లో 2, జనగామలో 10, నిజామాబాద్లో 8, వనపర్తిలో ఒకటి, సిద్దిపేటలో 10, సూర్యాపేటలో 10, గద్వాలలో 5 కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.