Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ ప్రయివేటు కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి యాజమాన్యాలు జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్టీసీఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద పలువురు అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.