Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జీఓ నెంబర్ 46 ద్వారా ప్రభుత్వం అనుమతించిన ట్యూషన్ ఫీజు వరకే పరిమితం కాకుండా ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఆయా యాజమాన్యాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో గల సెయింట్ ఆండ్రూస్ స్కూల్ వద్ద ధర్నా చేసిన తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. నెలకు రూ.2 వేలలోపు ఉండాల్సిన ట్యూషన్ ఫీజును రూ.8,500 వసూలు చేస్తున్నదని విమర్శించారు. ఆ పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్య తీసుకోవాలని కోరారు.