Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రికి ఎంపీ నామా లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం నుంచి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ నిశాంక్కు ఆయన మంగళవారం లేఖ రాశారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో అదనంగా 23 జిల్లాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆయా కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలంటూ తాను పార్లమెంటులో కోరిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. బోధన సిబ్బంది రిజర్వేషన్ బిల్లు - 2019 చర్చ సందర్భంగా తానీ ప్రస్తావన చేసినట్టు గుర్తుచేశారు.