Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బొడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పట్టపగలే ఇంటిమీద పడి దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. దాదాగిరి పోవాలంటే...ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే శాంతిభద్రతలకు చక్కబడతాయని వ్యాఖ్యానించారు. భూవివాదంలో తలదూర్చడమే కాకుండా ప్రశ్నించిన వ్యక్తిపై స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త దాడికి దిగడం అమానుషమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీధర్గౌడ్తోపాటు దాడిలో పాల్గొన్న వారందరిపై హత్యయత్నం కేసులు నమోదు చేయాలంటూ అదనపు డీజీ జీతేందర్ని కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతుంది : జగ్గారెడ్డి
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతున్నదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే చనిపోతామని ప్రజలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఒక ప్రకటనలో కోరారు. ఆర్ధిక మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకు వెయ్యి, రెండు వేల కోట్లు తీసుకొని రాలేవా అని ప్రశ్నించారు. నేనే మంత్రిగా ఉంటే అక్కడే గవర్నమెంట్ ఆస్పత్రిలో మంచం వేసుకొని ఉండేవాడినన్నారు.