Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని క్రీడాకారులకు 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు మంగళవారం దక్షిణాది రాష్ట్రాల క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఉన్నత విద్య అభ్యసించే క్రీడాకారుల కోసం 0.5 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 250 ఎకరాలు విస్తీర్ణంలో క్రీడాపాఠశాల ఉందనీ, క్రీడా పాఠశాలలో మౌలిక వసతులను కల్పించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.