Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనవళ్ల దుర్మార్గం
నవతెలంగాణ-శంకర్పల్లి
ఆస్తి కోసం మనవళ్లు దుర్మార్గానికి ఒడిగట్టారు. సొంత నానమ్మనే హత్య చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటి సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎలవర్తి గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గాండ్ల కంసమ్మ(70) తన పేరు మీదున్న 3.30 ఎకరాల భూమిని ఆమె ముగ్గురు కుమార్తెల పేరున పట్టా చేయించింది. కూతుళ్లకెందుకిచ్చావంటూ కోడలు విజయ అత్తను ప్రశ్నించింది. తన ఇష్ట ప్రకారమే చేశానంటూ ఆమె బదులిచ్చింది. దాంతో కోడలు గ్రామ పెద్దల వద్దకు వెళ్లింది. వారు పట్టించుకోకపోవడంతో తిరిగి ఇంటికొచ్చి అత్తతో గొడవపడింది. ఈ విషయంలోనే కంసమ్మ మనవళ్లు శ్రావణ్, శివకుమార్ ఆమెపై కక్షపెంచుకున్నారు. ఎవరూ లేని సమయం చూసి నానమ్మతో పాటు ఆమె ఉంటున్న ఇంటిపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు కోడలు, మనుమలపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.