Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
అదనపు కట్నం కోసం భర్త, అత్తామామల వేధింపులు తట్టుకోలేక మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సాఫ్ట్వేర్ ఉద్యోగి కంకణాల సంతోష్, స్రవంతి(31)కి 2017లో వివాహమయింది. ఉద్యోగం రీత్యా వీరు గోపన్పల్లిలోని ముప్పా అపార్ట్మెంట్లో సంతోష్ తల్లితో కలిసి ఉంటున్నారు. వీరికి రెండేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, స్రవంతిని అదనపు కట్నం కోసం అత్తామామలు వేధించేవారు. ఇదే విషయమై ఆమె పోలీసులకూ ఫిర్యాదు చేసింది. వీరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా భర్త సంతోష్, అత్తతో స్రవంతికి గొడవ జరిగింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. అపార్ట్మెంట్ బి బ్లాక్ 3వ అంతస్తు నుంచి పార్కింగ్ సెల్లారులో పడిపోయింది. ఆమె పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది.