Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్వీట్ చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందనీ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హౌం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు టెలి మెడిసిన్ సేవలు అందిస్తామని మంత్రి మంగళవారంం ట్వీట్ చేశారు. ఏవైనా సందేహాలు వస్తే 1800 599 4455 టోల్ఫ్రీ నెంబరుక కాల్ చేయాలని సూచించారు. టెలి మెడిసిన్ పూర్తిగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవ అన్నారు.