Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె, పట్టణ ప్రగతి కోసం...
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ కోసం స్థానిక సంస్థలకు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ వీరిని నియమించారు. మొత్తం 17 మంది అధికారుల్లో 8 మంది అడిషనల్ కలెక్టర్లు (ఐఏఎస్), 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వీరంతా స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులుగా ఉంటారు.