ప్రశ్న: మనకు తెలిసిన మూలకాలన్నింటినీ కలగూరగంపలాగా కలిపేసి ఒక ముద్దలా చేస్తే ఏమవుతుంది?
- టి.రంజిత్కుమార్, ఎం.పవ్రీణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రపద్రేశ్ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్, కొడిగెనహళ్లి, అనంతపురం
జవాబు : ఒక ముద్దలా వున్న పాదార్థిక శక్తి భాండారం నుంచే వివిధ మూలకాలు ఏర్పడ్డాయి. చాలా మూలకాలు స్వతసిద్ధంగా స్థిరంగానే వుంటాయి. మూలకాలు కలిసి కొత్తకొత్త పదార్థాలు ఏర్పడే ప్రక్రియ సాధారణంగా రసాయనిక ప్రక్రియ. మీరన్నట్టు మూలకాలలోని పర మాణువుల కేంద్రకాలను ఏమాత్రం మార్చకుండా పరమాణువుల్ని కలిపి బందంగా చేసే ప్రక్రియను రసాయనిక సంశ్లేషణం అంటాము. పరమాణు కేంద్రాల బయట తచ్చాడుతున్న ఎలక్ట్రాన్ల మేఘాల సంకలనం ద్వారా పరస్పరం అంటుకుపోయి బహు పర మాణువుల పదార్థాలు ఏర్పడడం చాలా విస్తారంగా చూస్తుం టాము. వీటిని రసాయనిక ప్రక్రియలు అంటాము. ఉదాహరణకు ఉదజని (నyసతీశీస్త్రవఅ) పరమాణువులు రెండు, ఒక ఆక్సిజన్ పరమాణువు తమ వద్ద ఉన్న ఎలక్ట్రాన్ల మేఘాలనే జిగురుతో పరస్పరం నిర్దిష్టరూపంలో సంధానించుకొంటే ఏర్పడిందే నీరు. ఇలా పరమాణు సంకలనంతో ఏర్పడ్డ పదార్థాలను సంయోగ పదార్థాలు (జశీఎజూశీబఅసర) అంటారు. పరమాణు సంధానం ద్వారా ఏర్పడ్డ బహు పరమాణు సందోహాన్ని అణువు (వీశీశ్రీవషబశ్రీవ) అంటాము. ఉ2, జఉ2, జ6న6, న2ఉ, జ2న5ఉన, జ12న22ఉ11 ఇలా తక్కువ నుంచి ఎక్కువ పరమాణువుల కలయిక ద్వారా లక్షలాది సంయోగ పదార్థాలు సహజంగానూ, క త్రిమంగాను ఏర్పడు తున్నాయి. అలాకాకుండా మొత్తం కేంద్రకాల తో పాటుగా పరమాణువులన్నింటినీ కలిపేస్తే కొత్త పరమాణువు వస్తుందా అన్న విధంగా మీ ప్రశ్న వుంది. దానికి కొంత మేరకు 'అవును' అని, కొంతమేరకు 'కాదు' అని సమాధానం యివ్వవలసి వుంటుంది.
ఉదాహరణకు సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి యిలా పరమాణువులు మొత్తం కల్సిపోయి వేరే పరమాణువులుగా మారడం వల్లనే సిద్ధిస్తోంది. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే... 4 హైడ్రోజన్ పర మాణువులు (హైడ్రోజన్ మూలకం) కల్సిపోయి ఒక హీలియం పరమాణువు (హీలియం మూలకం) గా మారడంలో ధ్వంసమైన ద్రవ్యరాశి శక్తిగా మారడం వల్లన సౌరశక్తి వస్తోంది. మరికొన్ని నక్షత్రాలతో కర్బనం (జ) , నత్రజని (చీ), ఆమ్లజని (ఉ) లు పరస్పరం కలిసిపోయి కొత్త మూలకాలుగా మారడం ద్వారానే ఆ నక్షత్రాలు వెలుగును యిస్తున్నాయి. ఒక మూలక పరమాణువులను మరో తేలికపాటి మూలక పరమాణువులతో అధికవేగంతో తాడనం (bశీఎbaతీసఎవఅ్) చేయడం ద్వారా కొత్త మూలకాల్ని స ష్టిస్తున్నారు. కానీ ఈ పని అన్నింటి విషయంలోను వీలుకాదు. ఏర్పడ్డ కొత్త మూలకపు శక్తి, ఏర్పడేందుకు సహకరించిన మాత మూలకాల శక్తికన్నా తక్కువ వుంటేనే ఉత్పన్నమైన సంతాన మూలకం స్థిరంగా ఉండగలుగుతుంది. కానీ 5 కార్బన్ కేంద్రకాలను (126జ) కలిపేసి జింకు (6030్గఅ) మూలకాన్ని తయారు చేయడం దుర్లభం. సూత్రబద్దంగా వీలున్నట్టు అనిపించినా ప్రాయోగికంగా చాలా కష్టం. కానీ అన్ని మూలకాలు (జింకుతో సహా) చిన్నచిన్న మూలకాలతోనే ఒకప్పుడు ఏర్పడ్డాయి. కానీ ఆ పరిస్థితులు యిప్పుడు భూమ్మీదలేవు. ప్రస్తుతం మనకు తెలిసినంతవరకూ స్థిరంగా 100 మూలకాల వరకు ఉన్నాయి. మూలకాల పరమాణువుల్లోని కేంద్రకాలలో వున్న కేంద్రక కణాల (అబషశ్రీవశీఅర) యిన ప్రొటాన్లు, న్యూట్రాన్లు ఒకే తీరుగా గానీ, సమానంగా గానీ ఉండ వలసిన అగత్యంలేదు. ప్రొటాన్ల సంఖ్య మూలకానికి ప్రతినిధి కాగా, న్యూట్రాన్ల సంఖ్య మారినట్లయితే ఏర్పడేవి ఐసోటోపులు (సమ స్థానీయాలు) ఇలా సమస్థానీయాల (అన్ని మూలకాలు) నన్నింటినీ కలిపేసి ముద్ద చేయడం ప్రస్తుతం ఏమాత్రం వీలుగాని పరిస్థితి. కానీ అలా చేస్తే వచ్చే మూలకానికి అనంతమైన పరమాణు భారం (a్శీఎఱష షవఱస్త్రష్ట్ర్) వుంటుంది. ఇప్పుడున్న అన్ని మూలకాలు మొదట హైడ్రోజన్ మాత్రమే ఉన్న నక్షత్ర పళ్లేల నుంచే వచ్చాయి కాబట్టి మీరన్న సర్వ మూలక కేంద్రాల సమాగమం సంభవించినా ఆ మూలకం మళ్లీ హైడ్రోజనే అవుతుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization