ఇండియా స్మార్డ్ ఫోన్ దిగ్గజ సంస్థ షియోమీ మేడ్ ఇన్ ఇండియా పవర్ బ్యాంకులను రిలీజ్ చేసింది. మొదటి సారిగా ఇండియాలో థర్డ్ పార్టీ ఈ కామర్స్ స్టోర్లు అమెజాన్, ఫ్లిప్కార్టుల్లో వీటిని అందుబాటులోకి తీసు కొచ్చింది. 10వేల ఎంఏహెచ్, 20000 వేల ఎంఏహెచ్ పవర్బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా పవర్ బ్యాంకులు మొదటి సారి 2017 నవంబర్లో రిలీజ్ చేసినా అవి ఎంఐ హోమ్ స్టోర్లోనే అందుబాటులో ఉంచింది. ఇప్పుడు వీటిని అమెజాన్, ఫ్లిప్కార్టుల్లోకి తీసుకొచ్చినట్టు సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది.