ప్రశ్న: రైలు పట్టాలకు ఇరువైపులా కంకరరాళ్లు వేస్తారెందుకు? కానీ, రైల్వేస్టేషన్లలో పట్టాల దగ్గర కంకరరాళ్లు ఉండవు కదా!
- బి.దుర్గాప్రవీణ్
జవాబు : రైలుబండి చాలా ఎక్కువ బరువుతో ఉంటుంది. మనం ప్రయా ణించే రైలు పెట్టె (రైలుబోగీ) ఖాళీగావున్నా దాని బరువు సుమారు 40 టన్నులు (40 వేల కి.గ్రా.) ఉంటుంది. ప్రయాణీకులు, లగేజీ లాంటివి కలుపుకుంటే సుమారు 50 టన్నులు ఉంటుంది. ఇలాంటి పెట్టెలు గోదావరి ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ లాంటి బండ్లలో సుమారు 20 వరకూ ఉంటాయి. వీటికి తోడు సుమారు 100 టన్నుల వరకు ఉండే రైలు ఇంజనును కలుపుకుంటే సగటున ఓ పెద్ద రైలుబండి బరువు సుమారు 1100 టన్నుల వరకూ ఉంటుంది. ఇలాంటి రైలుబండిలో ప్రతి బోగీ కింద అటు నాలుగు చక్రాలు, ఇటు నాలుగు చక్రాలు పట్టాల మీద నడుస్తాయి. ఒక్కో చక్రం బరువే టన్ను ఉన్నా ఆశ్చర్యంలేదు. అలాంటి బరువైన చక్రాలతో బరువును మోస్తూ గంటకు అడపాదడపా 100 కి.మీ. వేగంతో వెళ్తున్నపుడు లోహ భాగమైన రైలు పట్టా, లోహభరితమైన రైలు చక్రాల మధ్య విపరీతమైన శబ్ధం పడుతుంది. సాధారణ రోడ్డు రవాణా వాహనాలైన లారీలు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు, కార్లు, బైకుల చక్రాలు రబ్బరుతో ఉండడం వల్ల ఘన రూప కాంక్రీటు లేదా తారు రోడ్ల మీద అవి వేగంగా వెళ్తున్న రబ్బరుకున్న స్థితి స్థాపక లక్షణం (వశ్రీaర్ఱషఱ్y) వల్ల శబ్ధం అట్టే ఎక్కువగా రాదు. కానీ రైలు పట్టాలకు, రైలు చక్రాలకు మధ్య శబ్ధం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. రైలు పట్టాకు, పట్టాకు మధ్య కావాలనే కొంత ఖాళీ ఉంచుతారు. ఆ ఖాళీ మీద రైలు చక్రం వెళ్లేపుడు అధిక మోతాదులో అదనపు శబ్ధం వస్తుంది. ఇలాంటి శబ్ధాల్ని అక్కడికక్కడే సమసిపోయేలా చేయకపోతే ఆరోగ్యకరమైన వినికిడి సామర్థ్యంతో రైలు ఎక్కిన తిరిగి ఇళ్లకు బధిరులు (చెవిటివారు)గా వెళ్లే ప్రమాదం ఉంది. రైలు పట్టాలకు అటూఇటూ, ఫిష్ ప్లేట్స్, స్లీపర్స్ (పెట్టెలో స్లీపర్స్ కాదు ) మధ్య కూడా దొడ్డు కంకర రాళ్లు సుమారు ఒకటి, రెండు అడుగు ఎత్తువరకు, అటుయిటూ రెండు మూడు అడుగుల విస్తారం వరకు వేస్తారు. ఈ రాళ్ల మధ్య సందులో రైలు కదులుతున్నపుడు వెలువడే తీవ్రమైన శబ్ధతరంగాలు, పదేపదే పరావర్తనం (ఱఅ్వతీఅaశ్రీ వషష్ట్రశీఱఅస్త్ర) జరుపుకొని చాలా మేరకు క్షీణిస్తాయి (సఱరరఱజూa్వ) తద్వారా ప్రయాణికులకు అసౌకర్యం తగ్గుతుంది. అంతేకాదు... దారి పొడుగునా రైలు పెట్టెల్లోని పాయిఖానాల్లో (=వర్ =శీశీఎర శీతీ ుశీఱశ్రీవ్ర) నుండి నేల మీద పడ్డ మలమూత్రాదులు ఆ రాళ్ల సందుల్లోకి చెల్లాచెదురుగా వెళ్లడం వల్ల త్వరగా సూర్యరశ్మి వేడికి, వాన తాకిడికి రైలు మార్గం శుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది. రైలు స్టేషన్లలో రైలు పట్టాల మధ్య అటూయిటూ కంకర రాళ్లు వేయ నవసరంలేదు. ఎందుకంటే రైలు స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి లేదా మెల్లగా ప్రయాణిస్తుంటాయి. కాబట్టి శబ్దం ఎక్కువగా రాదు. ఒకవేళ ఎక్స్ప్రెస్ బండ్లు ఆగని స్టేషన్లయితే ఎటూ ప్లాట్ఫారం నిడివి కిలోమీటరుకన్నా తక్కువే ఉంటుంది కాబట్టి శబ్దం కొంచెం ఎక్కువైనా కాసేపు మాత్రమే ఆ సమస్య ఉంటుంది. రైలు బండ్లు ఆగని చిన్నచిన్న స్టేషన్లు అయితే అక్కడా పట్టాల మధ్య, పట్టాలకు అటుయిటూ కంకర రాళ్లు వేసి ఉండడాన్ని సాధారణంగా గమనిస్తాము.
ప్రొఫెసర్
- ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,జన విజ్ఞాన వేదిక
Authorization