ప్రశ్న: మనం పడుకొనే దిశకు, భూమికున్న అయస్కాంత క్షేత్రానికి సంబంధం వుందా? ఉత్తర దక్షిణ దిశల్లో పడుకొంటే భూమ్యాస్కాంత బలం మన మీద చెడు ప్రభావం కల్గిస్తుందని విన్నాను. నిజమేనా? ఉత్తర, దక్షిణ దిశల్లో పడుకోవడానికి, మనిషి మరణానికి సంబంధం ఏంటి ?
- ఎం.సాత్విక, హన్మకొండ, వరంగల్ అర్బన్
జవాబు : మన శరీరం ఘన పదార్థం కాదు. మన శరీరంలో ఎముకల్లాంటి ఘన పదార్థాలున్నా అందులో ఉండేది ప్రధానంగా కాల్షియం ఫాస్ఫేట్. ఇది అయస్కాంతతత్వం లేని డయామ్యాగటిక్ పదార్థం. కేవలం రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల్లోని మయోగ్లోబిన్, సైటోక్రోమ్ -జ- ఆక్సిడెజ్ వంటి కొన్ని ధాతువులు మినహా అయస్కాంతతత్వం ఉన్న పదార్థాలు శరీరంలో చాలా అరుదు. పైగా వాటి మొత్తం శరీరంలో చాలా పేలవంగా వుంటుంది. సాధారణ ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో అయస్కాంత తత్వం ఏమీలేని పదార్థాల మోతాదు 99.99 వుంటుంది. అయస్కాంత తత్వం ఉన్న ఇనుము పురుషులలో కేవలం 3 గ్రాములు, స్త్రీలలో సుమారు 2.3 గ్రాములు మాత్రమే వుంటుంది. సాధారణ మనిషి సగటు బరువు 70 కిలోలు అనుకొంటే ఇది 0.0043 శాతం అవుతుంది. స్త్రీలలో సగటు బరువు 60 కిలోలు అనుకొంటే ఇనుము శాతం కేవలం 0.0038 అవుతుంది. అంటే యిందులో అయస్కాంత లక్షణం ఉండగలిగిన రాగి ధాతువు శరీరం మొత్తంలో 72 మి.గ్రా కన్నా తక్కువ వుంటుంది ఇక మిగిలిన వాటి గురించి ప్రస్తావించదగినంతగా ఏమీ ఉండదు. శరీరంలో ఉన్న 99.99 శాతం కన్నా ఎక్కువ భాగం డయామాగటిన్ పదార్థం కాబట్టి మన శరీరం భూమికున్న అయస్కాంత క్షేత్ర ప్రభావంతో ఏ మార్పునకూ, ప్రభావానికీ ప్రత్యేకంగా లోను కాదు.
మరో విషయం ఒకవేళ అంతో ఇంతో ఉందనుకున్నా మన శరీరం ఓ దండాయా స్కాంతం కాదు. స్తూపాకారంలో వున్న మన శరీరంలో సుమారు 54 శాతం నీరే వుంటుంది. మిగిలిన పదార్థాలు చాలామట్టుకు ద్రావణ స్థితిలో ద్రావితంగా లేదా కొల్లాయిడ్ తదితర రూపంలో డిస్పర్స్ ఫేజ్ రూపంలో వుంటాయి. అవి నిర్మాణయుతంగా నిర్దిష్ట స్ఫటికాకృతిలో వుండవు. అటుయిటు కదులుతూ వుంటాయి. కాబట్టి, మనం ఉత్తర దక్షిణ దిశల వైపు పడుకొంటే ఎంతమేరకు అయస్కాంత పదార్థాలుంటే వాటికి అయస్కాం తీకరణం (వీaస్త్రఅవ్ఱఓa్ఱశీఅ) జరుగుతుందో, డయామాగటిక్ పదార్థంలో ఎంతవరకు వికర్షక అయస్కాంత తత్వం ప్రేరేపితం (×అసబష్ఱశీఅ) అవుతుందో అంతే మోతాదులో ఈ రెండు ప్రేరణలు తూర్పు పడమర దిశల్లో పడుకున్నా జరుగుతుంది.
కేవలం తాము నమ్మే దిక్పాలకుల్లో ఒకడైన యముడు దక్షిణ దిశలో వున్నాడనీ, అతడు ఉత్తర దక్షిణ దిశల్లో పడుకున్నవారిని తొందరగా మృత్యువాత పడేస్తాడనీ నమ్మడం వల్ల ఆ నిరాధార మూఢనమ్మకానికి వంతపాడేందుకు కొన్ని పడికట్టు సైన్స్ పదాల్ని, భాషణను జోడించి నిద్రించే దిశకు, అయస్కాంత క్షేత్రానికి లింకు పెట్టారు. వారు క్రింది విషయాల పట్ల మౌనం వహిస్తారు.
1. యముడికి తూర్పు పడమరలు తెలీవా?
2. యమధర్మరాజు మానవ శరీరంలోని రసాయనిక ధాతువుల నిర్మాణం గురించి, వాటి అయస్కాంతతత్వం గురించి తెలీని అజ్ఞానుడా?
3. ప్రపంచంలో వయసుతీరకుండానే మరణించేవారిలో ఎక్కువమంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. అపుడు వారు నిద్రిస్తూ ఉత్తర దక్షిణ దిశల్లోనే డ్రైవ్ చేస్తున్నారా? కార్లు, వాహనాలు ఉత్తర దక్షిణ దిశల్లోనే ప్రయాణి స్తున్నపుడే ప్రమాదాలా?
ఒక వస్తువుపై భూమికున్న అయస్కాంత క్షేత్ర ప్రభావం వున్నదా లేదా అన్న విషయాన్ని ప్రాయోగికంగా ఋజువు చేయడానికి ఓ పద్ధతి వుంది. ఉదాహరణకు ఓ శుద్ధమైన ఇనుప ముక్కను (ఉదాహరణకు గోడకు కొట్టే మేకు లాంటిది) బల్లమీద ఎటు ఉంచినా ఎంత కాలమైనా అదే దిక్కులో వుంటుంది. ఇలాంటి స్తూపాకార లేదా పట్టకాకార పొడవాటి తేలికైన చీలను ఇపుడు మధ్యలో ఓ దారాన్ని కట్టి గాలిలో వ్రేలాడదీయాలి. అది వెంటనే కాకపోయినా కొన్ని గంటల తర్వాత ఉత్తర దక్షిణ దిశల్లోకి మళ్లే అవకాశం వుంది. ఎందుకంటే చీలలో వున్న ఒంటరి ఎలక్ట్రాన్లు (వీటి వల్లనే పదార్థాలకు అయస్కాంత తత్వం ఒనగూరుతుంది) భూఅయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల అవి అన్నీ ఉత్తర దక్షిణ దిక్కులకు తమ అయస్కాంత ద్విధ వ భ్రామకమనే సదిశ రాశిని (Vవవ్శీతీఱaశ్రీ ఎaస్త్రఅవ్ఱష సఱజూశీశ్రీవ ఎశీఎవఅ్) సర్దుకుంటాయి. అంతదనుక ఏ మాత్రం ఖచ్చిత దిశలో అంతర్గతంగా నికర అయస్కాంత తత్వంలేని ఇనుప చీలలో సైన్యం కవాతులాగా ఒంటరి ఎలక్ట్రాన్ల ద్విధ వ అయస్కాంత భ్రామకం సర్దుకోవడం వల్ల ఆ చీలకు కొంత అయస్కాంతతత్వం చేరుతుంది. ఈ ప్రక్రియనే అయస్కాంతీకరణ (వీaస్త్రఅవ్ఱఓa్ఱశీఅ) అంటాం. అదే చీలను బలవంతంగా తూర్పు పడమరల వైపు వ్రేలాడదీస్తే అందులో అయస్కాంతీకరణ జరగదని దీనర్థం కాదు. కానీ ఈ భంగిమలో అందులోని అయస్కాంతీకరణ మోతాదు తక్కువ. ఎందుకంటే ఇనుప చీలను ఓ ఘన పదార్థం అందులోని పరమాణువుల స్థావరాలు ఖచ్చితంగా ఆయా స్పటిక చట్రంలో నిర్దిష్ట స్థానాల్లో వుంటాయి. ఇనుప చీలలో జతకూడిన ఎలక్ట్రాన్ల వల్ల కలిగే అనాయస్కాంత ప్రభావం (సఱa-ఎaస్త్రఅవ్ఱష వటటవష్) కన్నా జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్ల వల్ల కలిగే పరాయస్కాంత ప్రభావం (ూaతీa-ఎaస్త్రఅవ్ఱష వటటవష్) అధికం. కాబట్టి ఇనుప చీలను వ్రేలాదీసినా లేదా ఇతర శాశ్వత అయ స్కాంతం చేత ప్రేరణ (×అసబషవస ఎaస్త్రఅవ్ఱఓa్ఱశీఅ) చేసినా లేదా ఆ చీల (మొల్ల) చుట్టూ కాసేపు స్థిర విద్యుత్ప్రవాహం (సఱతీవష్ షబతీతీవఅ్, సష టశ్రీశీష) జరిపినా అందులో నికర అయస్కాంతీకరణ ఏర్పడుతుంది. ఆ మీదట ఆ చీలను మనం ఎటు వ్రేలాడదీసినా అది ఉత్తర దక్షిణ దిశలోనే ఓ దిక్సూచి (జశీఎజూaరర) లాగా వ్రేలాడుతుంది. ఇక్కడ చీలలో ఉన్న ప్రతి ఎలక్ట్రాను ఓ బుల్లి అయస్కాంత దండం (baతీ ఎaస్త్రఅవ్) గా ప్రవర్తించడం అవి పరస్పరం అనుసంధానం చెందడం వల్ల భూఅయస్కాంత క్షేత్రంలో ద్విధ వ బలభ్రామ కానికి (టశీతీషవ శీట ఎశీఎవఅ్బఎ) లోనయి ఉత్తర దక్షిణ దిశలోని చీలను నెట్టతాయి. అదేవిధంగా మనిషిని క్షితిజ సమాంతరంగా ఇంటి పైకప్పు నుంచి వ్రేలాడదీస్తే ఎన్ని సంవత్సరాలయినా అలానే వుంటాడు గానీ ఉత్తర దక్షిణ దిశలోకి సర్దుకోబడడు. అంతేకాదు, ఆ మనిషి చుట్టూ ఓ రాగి తీగను చుట్టి గంటల తరబడి స్థిర విద్యుత్త్ను పంపి మళ్లీ ఎటు వ్రేలాడదీసినా అటే ఉంటాడుగానీ ఉత్తర దక్షిణ దిశల్లోకి సర్దుకోడు. ఎందుకంటే మనిషి శరీరంలో, మొదట్లోనే చెప్పినట్లుగా, అయస్కాంతీకరణ చెందడానికి వీలయిన ధాతువుల (ఇనుము అయాన్లు, రాగి అయాన్లు మొపప) మోతాదు పట్టుమని 1 శాతం కూడా ఉండదు. అయస్కాంత ప్రభావాన్ని ఎదుర్కొనేలా పరాయాస్కాంత ప్రభావం కలగదు. పైగా ఆయా అయస్కాంత అయాన్లు ద్రావణం (రక్తం, సైటు ప్లాజం మొపప) లో ద్రావకం లాగా (నీటిలో చేపల్లాగా) ఉండడం వల్ల శరీరాన్ని ఎటు వ్రేలాడదీసినా అవి అంతర్గతంగా ఉత్తర దక్షిణ దిశల్లోనే ఎపుడూ వుంటాయి. పడుకొనే శారీరక భంగిమ వాటి అంతర్గత దిశను నిర్ధారించదు. చిన్న దిక్సూచిని మనిషి పొట్టమీద సెలోటేపుతో అతికించి అతడిని ఒకసారి ఉత్తర దక్షిణ దిశలో, మరోసారి తూర్పు పడమర దిశలో పడుకోమని చూడండి. పొట్టమీద దిక్సూచి ఎపుడూ ఉత్తర దక్షిణ దిశనే చూపుతుంది. మనిషి మీద భూఅయస్కాంత ప్రభావం ఉన్నట్లయితే దిక్సూచి ముల్లు (ూశీఱఅ్వతీ) దిశ మనిషి ఉత్తర దక్షిణ దిశల్లో పడుకొన్నప్పుడు, తూర్పు పడమర దిశలో పడుకొన్నప్పుడు ఎంతోకొంత కోణంలో తేడా చూపాలి. కానీ అలా జరగదు. కాబట్టి ఎటు పడుకున్నా భూ అయస్కాంత ప్రభావం మనిషి శరీరం మీద వుండదు. పడుకొనే దిశకు మానసిక ప్రవృ త్తికి కార్యకారణ సంబంధం వుందను కోవడం అజ్ఞానం లేదా బూటకపు సైన్సు (ూరవబసశీ ూషఱవఅషవ) పదాల మాటున చేసే కపటం.
ప్రొఫెసర్
- ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization